డొమెస్టిక్​ క్రూడ్​పై  విండ్ ఫాల్​ ట్యాక్స్​ నిల్

డొమెస్టిక్​ క్రూడ్​పై  విండ్ ఫాల్​ ట్యాక్స్​ నిల్

న్యూఢిల్లీ : డొమెస్టిక్​ క్రూడాయిల్​ ప్రొడక్షన్​పై విండ్​ఫాల్​ట్యాక్స్​ను కేంద్ర ప్రభుత్వం 'నిల్​' చేసింది. డీజిల్​, ఏవియేషన్​ టర్బైన్​ ఫ్యూయెల్​ (ఏటీఎఫ్​)లపై అంతకుముందున్న జీరో డ్యూటీనే కొనసాగించాలని నిర్ణయించింది. ఓఎన్​జీసీ వంటి కంపెనీలు దేశంలో ఉత్పత్తి చేసే క్రూడ్​పై స్పెషల్​ ఎడిషనల్​ ఎక్సైజ్​ డ్యూటీ (ఎస్​ఏఈడీ)ని నిల్​ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటిదాకా ఈ ఎస్​ఏఈడీ  టన్నుకు రూ. 4,100 గా ఉండేది. మంగళవారం నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. జులై 2022 లో విండ్​ఫాల్​ ట్యాక్స్​ అమలులోకి తెచ్చిన తర్వాత డొమెస్టిక్​ క్రూడ్​పై దానిని నిల్​ లెవెల్​కి తేవడం ఇది రెండోసారి.

ఈ ఏడాది ఏప్రిల్​ మొదట్లో ఒకసారి నిల్​ లెవెల్​కు తెచ్చినా, అదే నెలలో 15 రోజుల తర్వాత మళ్లీ టన్నుకు రూ. 6,400 చొప్పున విండ్​ఫాల్​ ట్యాక్స్​ను విధించారు. డీజిల్​ ఎక్స్​పోర్ట్​పై డ్యూటీని ఏప్రిల్​4 న జీరో లెవెల్​కు తెచ్చారు. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. గ్లోబల్​గా క్రూడ్​ రేట్లు బ్యారెల్​ ఒకటికి ​80 డాలర్ల నుంచి ఇటీవల 75 డాలర్లకు తగ్గడంతో డొమెస్టిక్​ క్రూడ్​ ప్రొడక్షన్​పై విండ్​ఫాల్​ ట్యాక్స్​ను తగ్గించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ప్రతీ 15 రోజులకి ఒకసారి విండ్​ఫాల్​ ట్యాక్స్​ను రివ్యూ చేస్తున్న విషయం తెలిసిందే.