పోడు పట్టాలకు పైసలడుగుతున్రు

పోడు పట్టాలకు పైసలడుగుతున్రు

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: పోడు పట్టాల కోసం అటవీశాఖ సిబ్బంది పైసలు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చంద్ర తండాకు చెందిన రైతులు మంగళవారం డీఎఫ్ వో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు ఆర్వోఎఫ్ఆర్‌‌ నంబర్ కేటాయించినా సర్వే మాత్రం చేయడం లేదన్నారు. బీట్​ఆఫీసర్ డబ్బులు ఇచ్చిన వారికే సర్వే చేస్తున్నారని పేర్కొన్నారు.

దళారుల వద్ద డబ్బులు తీసుకుని సాగులో లేని భూములను కూడా సర్వే చేస్తున్నారని ఆరోపించారు. సర్వే ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తే తమపై బీట్ ఆఫీసర్ దాడి చేశారని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో రైతులు భూక్య చందర్, ఇస్లావత్ చందు, నూనావత్ వీరు, ఇస్లావత్ క్రాంతి, ఇస్లావత్ రెడ్డా ఉన్నారు.