దేశంలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా మరింత విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 11 వేల 156 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజుల్లో వచ్చిన కేసుల్లో  ఇదే హయ్యస్ట్. కరోనాతో నిన్న 357 మంది చనిపోయారు. 24 గంటల్లో నమోదైన మరణాల్లోనూ ఇదే రికార్డ్. దేశంలో కరోనా మరణాలు 8 వేలు దాటాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 87 వేల 155 కాగా.. మరణాలు 8 వేల 107. లక్షా 40 వేల 979 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం లక్షా 38 వేల యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల కంటే రికవరీ ఎక్కువగా ఉండటం మంచి పరిణామమని ICMR తెలిపింది. దేశంలో కరోనా టెస్టులు 50 లక్షలు దాటాయి.

మహారాష్ట్రలో నిన్న 3 వేల 254 కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో ఒక్క రోజులో వచ్చిన కేసుల్లో ఇదే రికార్డ్.  నిన్న మరో 149 మంది చనిపోవడంతో మహారాష్ట్రలో మొత్తం మరణాలు 3 వేల 438కి పెరిగింది. ముంబైలోనే కేసులు 52 వేల 6 వందలు దాటాయి. తమిళనాడులో 19 వందల 27 కొత్త కేసులు రావడంతో మొత్తం బాధితులు 36 వేల 841కు చేరారు. ఢిల్లీలో కేసుల సంఖ్య 32 వేల 810కి పెరగగా.. 984 మంది చనిపోయారు. గుజరాత్ లో  21 వేల 554 మంది బాధితులు ఉండగా.. 13 వందల 47 మంది కరోనాకు బలయ్యారు. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ లో 11 వేల 6 వందలకు పైగా కేసులన్నాయి. మధ్య ప్రదేశ్ లోనూ కరోనా కేసులు 10 వేలు దాటాయి. వెస్ట్ బెంగాల్, హర్యానాలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

మరిన్ని వార్తల కోసం

బతుకు భరోసా లేని జర్నలిస్టులు

ఒక్కొక్కరికీ 12 గంటల డ్యూటీ!