దేశం గర్వించదగ్గ సినిమా ఇండస్ట్రీ తెలంగాణలోనే ఉంది.. ఈశాన్య రాష్ట్రాల ఫిల్మ్ ఫెస్టివల్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

దేశం గర్వించదగ్గ  సినిమా ఇండస్ట్రీ తెలంగాణలోనే ఉంది.. ఈశాన్య రాష్ట్రాల ఫిల్మ్ ఫెస్టివల్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

‘‘దేశం గర్వించదగ్గ  సినిమా ఇండస్ట్రీ తెలంగాణలోనే ఉందని గవర్నర్‌‌‌‌ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసించారు.   ప్రసాద్ ఐమ్యాక్స్‌‌లో జరుగుతున్న ఈశాన్య రాష్ట్రాల ఫిల్మ్ ఫెస్టివల్‌‌ను శుక్రవారం (నవంబర్ 21) ఆయన ప్రారంభించారు.  

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌‌డీసీ ఛైర్మన్‌‌ దిల్ రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ నార్త్ ఈస్ట్‌‌ కనెక్ట్‌‌లో భాగంగా రెండు రోజుల పాటు ఈ చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు.  ఈశాన్య రాష్ట్రాలు సంస్కృతి, ప్రకృతి పరంగా దేశంలోనే వైవిధ్యమైనవని,  మణిపూర్, అస్సాం రాష్ట్రాల్లో ప్రతిభావంతులైన ఫిల్మ్ మేకర్స్‌‌ ఉన్నారని ఆయన చెప్పారు.