ప్రభుత్వం బడుల అభివృద్ధికి సీఎంఆర్ విరాళం

ప్రభుత్వం బడుల అభివృద్ధికి సీఎంఆర్ విరాళం

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మన ఊరు–మన బడి కార్యక్రమానికి సీఎంఆర్ ఫౌండర్, చైర్మన్ మావూరి వెంకటరమణ రూ.50 లక్షల విరాళం అందించారు. ఇటీవల ఖమ్మంలో సీఎంఆర్ షాపింగ్​ మాల్​ 19వ స్టోర్​ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, ఖమ్మం మున్సిపల్​ కమిషనర్ ఆదర్శ్​ సురభి, ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్​ మేయర్ పునుకొల్లు నీరజ సమక్షంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​కు రూ.50 లక్షల చెక్కును సంస్థ ఫౌండర్, చైర్మన్ మావూరి వెంకటరమణ, మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్​ బాలాజీ అందజేశారు.

ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్లకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ మొత్తం అందించినట్టు సీఎంఆర్​ యాజమాన్యం వెల్లడించింది. సామాజిక ధృక్పథంతో తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది.