
- సర్పంచ్ ఎన్నికలకు రూ.175 కోట్లు
- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రూ.150 కోట్లు
- బడ్జెట్ రిలీజ్ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మంజూరు చేసింది. ఎన్నికల ఖర్చు కోసం పంచాయతీరాజ్శాఖ రూ.450 కోట్లకుపైగా ప్రపొజల్స్పంపించగా.. ప్రభుత్వం రూ.325 కోట్లు కేటాయించింది. సర్పంచ్ లఎన్నిక కోసం రూ.175 కోట్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నిక కోసం రూ.150 కోట్లు విడుదల చేసింది.
ఈ నిధులను బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ కుసంబంధించిన మెటీరియల్, ఎన్నికల సిబ్బంది శిక్షణ కోసం వినియోగించనున్నారు. ఆయా జిల్లాలకు పోలింగ్ కేంద్రాల వారీగా ఈ నిధులు పంపిణీ చేస్తారు. ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికకు సంబంధించి జడ్పీ సీఈఓలకు.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు సంబంధించి డీపీఓల అకౌంట్లో ఈ ఫండ్స్ జమ చేయనున్నారు. కాగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.