ప్రభుత్వం కబ్జాలకు పాల్పడుతోంది..కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ప్రభుత్వం కబ్జాలకు పాల్పడుతోంది..కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  • చెరువులను కాపాడుకుంటాం

రంగారెడ్డి : కబ్జాలను అరికట్టాల్సిన ప్రభుత్వమే కబ్జాలకు పాల్పడుతోందని విమర్శించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా నెక్సపూర్ చెరువులో ఎస్టీపి నిర్మాణాన్ని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం అక్కడ అక్రమంగా ఎస్టీపి నిర్మాణం చేస్తోందన్నారు. వెంటనే నిర్మాణ పనులను ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా చెరువును స్థానికులు కాపాడుకుంటున్నారని, రూ.7 కోట్లతో సుందరీకరణ పనులు కూడా చేశారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజాభీష్టాన్ని గౌరవించాలన్నారు.

ఇవి కూడా చదవండి..

రేపు పబ్లిక్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం

ఐదెకరాలలోపు ఉంటెనే రైతుబంధు ఇయ్యాలె