చరిత్ర కలిగిన దేవాలయాలను ప్రభుత్వం గుర్తించాలి

చరిత్ర కలిగిన దేవాలయాలను ప్రభుత్వం గుర్తించాలి

మహేశ్వరం: చరిత్ర కలిగిన దేవాలయాలను ప్రభుత్వం వెలుగులోకి తేవాలన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. గురువారం ఆయన..తుక్కుగూడలో జరిగిన వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్.. వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పురాతన దేవాలయాల చరిత్ర చాలా వరకు భక్తులకు తెలియదని.. ప్రభుత్వం చొరవతో చరిత్ర కలిగిన తెలంగాణలోని దేవాలయాలను వెలుగులోకి తేలవాలన్నారు. గతంలో ఈ ఆలయానికి సంబంధించిన భూమి 350 ఎకరాల్లో ఉండేదని.. ప్రస్తుతం అది 3 ఎకరాలకు కుదించుకు పోయిందన్నారు. దేవాలయాన్ని అభివృద్ధి చేయాలంటే కనీసం 40 ఎకరాల భూమి కావాలని ఇక్కడి స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని, 40 ఎకరాలు కేటాయించాల వివేక్ కోరారు.