భార్య కాపురానికి రాలేదని సెల్ టవర్ ఎక్కిన భర్త

భార్య కాపురానికి రాలేదని సెల్ టవర్ ఎక్కిన భర్త

భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ భర్త.  ఈ ఘటన  కర్నూలు జిల్లా మిడుతూరులో జరిగింది. గడివేముల మండలం బోళ్లవరం గ్రామానికి చెందిన మహేష్ అలగనూరు గ్రామానికి చెందిన సంధ్యకు 10 సంవత్సరాలకు క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో  గతేడాది భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో  మంగళవారం  మహేష్  మిడుతూరుకు చేరుకొని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసాడు. గ్రామస్తులు మహేష్ సెల్ టవర్ ఎక్కిన విషయం గమనించి పోలీసులకు ఫోన్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహేష్ ను కిందకు  రావాలని చెప్పారు. ఎంత చెప్పిన వినకపోవడంతో మహేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సెల టవర్ దగ్గరకు వచ్చిన భార్య,పిల్లలు, తల్లి, బంధువులు కిందకు దిగాలని కోరారు. అయినా వినకపోవడంతో పోలీసులు వల ఏర్పాటు చేసి కాపాడారు. మహేశ్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.

see more news

మింత్రాతో జతకట్టిన విజయ్ ‘రౌడీ‘ ఫ్యాషన్ బ్రాండ్

టీ20లకు గుడ్ బై చెప్పనున్న స్టార్ క్రికెటర్