ఘట్ కేసర్ లో విషాదాంతంగా ముగిసిన బాలుడి అదృశ్యం కేసు

ఘట్ కేసర్ లో విషాదాంతంగా ముగిసిన బాలుడి అదృశ్యం కేసు

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ కొండాపూర్ లో అదృశ్యమైన బాలుడి ఘటన విషాదాంతంగా ముగిసింది. మూడు రోజుల క్రితం వర్షంలో బయటకు వెళ్లిన బాలుడు..ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు అన్ని చోట్ల గాలించారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో చివరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా...కొండాపూర్ చెరువులో బాలుడి సంతోష్ మృతదేహాన్ని గుర్తించారు. చెరువు  పక్కన ఉన్న వాసవి వెంచర్ మ్యాన్ హోల్ లో బాలుడి  మృతదేహాన్ని గుర్తించారు. 

మూడు రోజుల క్రితం సంతోష్ స్థానిక మంగలి గుట్ట వద్ద బట్టలు ఉతకడానికి కుటుంబ సభ్యులతో కలిసి చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడే మంగలి గుట్ట చెరువు వద్ద అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత దగ్గరలోని ప్రైవేట్ వెంచర్ మ్యాన్ హోల్ లో పడి విగతజీవిగా కనిపించాడు. సంతోష్ మృతిపై కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

బాలుడిని ఎవరైనా హత్య చేశారా..? లేక ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్ లో పడిపోయాడా..? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. బాలుడి మృతితో ఈ ముగ్గురికి ఏదైనా సంబంధం ఉందా..? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సంతోష్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు పోలీసులు.