- మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ డివిజన్లలో సమస్యలు
- ఎంప్లాయీస్, స్టూడెంట్లకు రోజూ తప్పని ఇబ్బందులు
- కాలనీల్లో రోడ్లపై పారే మురుగుతో భరించలేని దుర్వాసన
- ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం
- స్థానిక కాలనీవాసులతో కలిసి నిరసన తెలిపిన కార్పొరేటర్
గచ్చిబౌలి, వెలుగు: సిటీలో ఐటీ కారిడార్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలన్నీ గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్డివిజన్లలోనే ఏర్పాటై ఉన్నాయి. ఆయా కంపెనీల్లో పనిచేసే వేలాదిమంది ఉద్యోగులు కూడా స్థానికంగానే ఎక్కువగా నివసిస్తుంటారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోకి వచ్చే ఆయా డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ ప్రాబ్లమ్స్అధికంగా ఉన్నాయి. వాటిపై కాలనీల వాసులు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ప్రజాప్రతినిధులు అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నా డివిజన్లు ఇంకా చాలా వెనుకబడే ఉన్నాయి. ఇటీవల ఓ కార్పొరేటర్తన డివిజన్లోని కాలనీలో డ్రైనేజీ సమస్యపై కాలనీవాసులతో కలిసి ఆందోళన చేయడంతో అధికారుల పనితీరు ఏంటో తెలుస్తోంది.
60 శాతం మంది వరకు ఉంటుండగా..
శేరిలింగంపల్లి జోన్ చందానగర్సర్కిల్ పరిధిలోని మాదాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్లలోనే ఐటీ కంపెనీలు ఏర్పాటై ఉన్నాయి. వీటిలో వర్క్ చేసే ఎంప్లాయీస్ 60 శాతం మంది వరకు ఆయా డివిజన్ల పరిధిలోని అపార్ట్మెంట్లు, హాస్టళ్లలో ఉంటారు. అభివృద్ధి చెందినవిగా చెప్పుకునే డివిజన్లలో డ్రైనేజీ, సీసీ రోడ్ల ప్రాబ్లమ్స్కూడా ఎక్కువే. దీంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడంలేదు. మాదాపూర్హైటెక్స్పక్కనే ఉన్న ఖానామెట్, ఇజ్జత్నగర్, గుట్టుల బేగంపేటలో సరైన డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు లేవు. ఖానామేట్ప్రభుత్వ స్కూల్వెనకాల రోడ్డులో డ్రైనేజీ మ్యాన్హోల్స్ఎక్కువ ఎత్తులో నిర్మించగా వచ్చిపోయేవారికి ఇబ్బందులు వస్తున్నాయి. సొసైటీలో సీసీ రోడ్లు లేవు. దీంతో రోడ్లపై వెహికల్స్వస్తూ పోతుంటే దుమ్ము లేచి ఇండ్లలోకి చేరుతోంది. కొండాపూర్లోని అంజయ్యనగర్ లో అండర్గ్రౌండ్సీవరేజ్పైప్లైన్నిర్మించి సీసీ రోడ్డు వేయలేదు. దీంతో బైక్లు మట్టిలో దిగబడిపోయి బయటకు రాని పరిస్థితి నెలకొంది. మరోచోట డ్రైనేజీ నీరు రోడ్డుపై పారుతుండగా కంపును తట్టుకోలేక స్కూల్కు వెళ్లే స్టూడెంట్స్, ఆఫీస్లకు వెళ్లే ఉద్యోగులు ముక్కు మూసుకుని పోవాల్సి వస్తోంది. సిద్ధిక్నగర్ లోనూ సీసీ రోడ్డు, డ్రైనేజీ సమస్యలు ఎక్కువే. గచ్చిబౌలి డివిజన్గోపన్పల్లిలో డ్రైనేజీతో స్థానికులు, వాహన దారులు కష్టాలు తప్పడంలేదు. తెల్లాపూర్వైపు రోడ్డు నిర్మాణం జరుగుతుండగా అండర్గ్రౌండ్సీవరేజ్ పైప్లైన్వేయగా, నెలలు గడుస్తున్నా పనులు పూర్తి చేయట్లేదు. డ్రైనేజీ నీరంతా రోడ్లపై పారుతూ చెరువులా తయారైంది. స్థానికులు కంపు భరించలేకపోతున్నారు. ఈరోడ్డులో ప్రయాణించే వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులను కోరిన, అధికారులకు కంప్లయింట్చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.