ఉధృతంగా ప్రవహిస్తోన్న కిన్నెరసాని వాగు

ఉధృతంగా ప్రవహిస్తోన్న కిన్నెరసాని వాగు

గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లాలో కిన్నెరసాని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు రవాణా స్తంభించింది. ఆదివాసీలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగు దాటుతున్నారు. ఆళ్ళపల్లి మండలం నడిమిగూడెం, సజ్జల బోడు, దొంగతోగు గ్రామాలకు చెందిన జనం, రైతులు, కూలీలు వివిధ పనుల కోసం గుండాల మండల కేంద్రానికి వెళ్లి వస్తు ఉంటారు. మోదుగులగూడెం - సజ్జలబోడు గ్రామాల మధ్య నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జ్ పనులు మధ్యలో ఆగిపోయాయి. దీంతో తప్పనిసరిగా కిన్నెరసాని వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కర్రల సహాయంతో దాటుతున్నారు ఆదివాసీలు. . వెంటనే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.