అప్పుడు మీనాక్షి.. ఇప్పుడు మృణాల్.. పాపం పూజ

అప్పుడు మీనాక్షి.. ఇప్పుడు మృణాల్.. పాపం పూజ

అదేంటో పాపం ప్రస్తుతం పూజ హగ్దే(Pooja hegde) పరిస్థితి అస్సులు బాలేదు. మొన్నటివకూ స్టార్ హీరోయిన్ గా వరుస క్రేజీ ఆఫర్స్ కొట్టీసిన ఈ బ్యూటీకి ఇప్పుడు ఒక్క అవకాశం కూడా రావడంలేదట. అంతేకాదు.. ఆల్రెడీ సెట్ అయిన ప్రాజెక్ట్స్ నుండి కూడా ఈ అమ్మడును తీసేస్తున్నారట. ఇప్పటికే మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం(Gunturu kaaram) నుండి పూజను తీసేసి.. ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary)ని తీసుకున్నారు. ఇక తాజాగా ఈ బ్యూటీని మరో ప్రాజెక్టు నుండి కూడా తీసేశారట. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) రీసెంట్ గా మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హీరోగా ఒక సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mytri movie makers) నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అంతేకాదు అనౌన్స్మెంట్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా కోసం రవితేజకు జోడీగా పూజా హెగ్డేను అనుకున్నారట మేకర్స్. 

తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి కూడా పూజను తప్పించి ఆమె స్థానంలో.. టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ను తీసుకున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానికి కారణం మృణాల్ కు నార్త్ లో మంచి క్రేజ్ ఉండటమే. సీత రామమ్ సక్సెస్ తో ఇండియా వైడ్ గా ఫెమస్ అయ్యింది మృణాల్. ఈ కారణంగానే రవితేజ, గోపీచంద్ మలినేని సినిమా కోసం మృణాల్ ను తీసుకున్నారట. ఇక పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.