
రంగా రెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో ఇసుక బుక్ చేసిన వ్యక్తికి అందులో మనిషి పుర్రె రావడం కలకలం రేపింది. స్టాక్ యార్డు నుంచి ఆన్ లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసిన శ్రీనివాస్ రెడ్డి.. ఆ ఇసుక తన స్థలానికి చేరిన తర్వాత గమనించగా.. అందులో అస్థిపంజరం తలభాగం కనిపించింది. దీంతో అనుమానం వచ్చి స్టాక్ యార్డుకి వెళ్లి అందులో పరిశీలించగా ఓ అస్థిపంజరం ఉన్నట్లు గుర్తించాడు. ఇసుకలో చేయి భాగం ఓ చోట, మరో ఎముక భాగం ఓ చోట చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. చేతి ఎముకకు ఉన్న గాజుల ఆధారంగా ఆ అస్థిపంజరం ఓ మహిళ ది అని తెలుసుకొని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఎల్బీ నగర్ ఇంచార్జ్ డీసీపీ యాదగిరి ఘటన స్థలాన్ని పరిశీలించగా.. ఆ ఇసుకలో మహిళ చీర కూడా కన్పించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.