హైదరాబాద్: ఖాళీ స్థలంలో ఉన్న ఓ రసాయన డబ్బాను తెరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆ డబ్బాను తెరిచేందుకు గట్టిగా షేక్ చేయడంతో అది ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి అతని చేతి వేళ్లు ఊడిపోయి కొంత దూరంలో ఎగిరిపడ్డాయి. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
జగద్గిరిగుట్ట లోని దేవేందర్ నగర్ లో ఖయ్యూమ్(40) అనే వ్యక్తి స్క్రాప్ ఏరుకోవడానికి వచ్చి ఖాళీ స్థలంలో ఉన్న డబ్బాలను తన సంచిలో వేసుకోబోయాడు. అందులో ఓ డబ్బా సీల్ వేసి ఉండడంతో అందులో ఏముందో తెలుసుకుందామని ఆ డబ్బాను ఊపాడు. ఆ డబ్బా ఒక్కసారిగా పేలి ఆ వ్యక్తి యొక్క చేతులు వేళ్ళు ఊడిపోయి ఎగిరిపడ్డాయి. ఈ సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది..అతడితో పాటు అతని పక్కనే ఉన్న మరో మహిళ ముని బేగం చేతులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.