ఓటిటిలో రిలీజ్ కానున్న ‘వీళ్లిద్దరి మధ్య’

ఓటిటిలో రిలీజ్ కానున్న ‘వీళ్లిద్దరి మధ్య’

మనసంతా నువ్వే, నేనున్నాను లాంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వి.ఎన్. ఆదిత్య నుండి వస్తోన్న నెక్స్ట్ మూవీ ‘వీళ్లిద్దరి మధ్య’. విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ జంటగా నటించారు. అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ఆహా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ ‘కాంటెంపరరీ కంటెంట్​తో సహజత్వానికి దగ్గరగా ఉండే ప్రేమ కథా చిత్రమిది. విరాజ్ అశ్విన్ రెండు షేడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తాడు.

హాలీవుడ్ ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్న నేహా కృష్ణను ముందు తెలుగు సినిమా చేయమని చెప్పి దీనికి తీసుకొచ్చాను. నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో మంచి  సినిమాగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. విరాజ్ మాట్లాడుతూ ‘ఆల్ మోస్ట్ డ్యూయల్ రోల్ లాంటి పాత్రలో నటించాను. కథ చెప్పినప్పుడు భయపడినా, ఆదిత్య గారు చెప్పిన ధైర్యంతో ఈ క్యారెక్టర్ బాగా చేశాను’ అని  చెప్పాడు.  నిర్మాత మాట్లాడుతూ ‘ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసేలా సినిమా ఉంటుంది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేయాలనే మాలాంటి నిర్మాతలకు ‘ఆహా’  మంచి ఆప్షన్ అయ్యింది’ అన్నారు.