హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ నూతన చైర్మన్గా సర్దార్ రవీందర్ సింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బుధ వారం ఎర్రమంజిల్లోని సివిల్ సప్లయ్స్ భవన్లో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, సివిల్ సప్లయ్స్ ఎండీ అనిల్ కుమార్ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు.
రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, దానికి అనుగుణంగా కార్పొరేషన్ ముందుకెళ్తుందని రవీందర్ సింగ్ చెప్పారు. సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి చాలా కీలకమైందని, ఈ విభాగంలో పనిచేసే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో రైతాంగంతో మమే కమై పనిచేశానని గుర్తుచేస్తుకున్నారు. నేడు సీఎం కేసీఆర్ ‘‘అబ్ కి బార్, కిసాన్ సర్కార్”అనే నినాదం పట్ల హర్షం వ్యక్తం చేశారు.