హైదరాబాద్ : తెలంగాణలో నిర్వహిస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఆ పార్టీ నాయకులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సమావేశాలను సక్సెస్ చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. HICCలో నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రాంగణాలకు ఆ పార్టీ నాయకులు ప్రముఖ నేతల పేర్లు కూడా పెట్టారు.
ప్రాంగణం పేరు
హెచ్ఐసీసీ నొవాటెల్ : శాతవాహన నగర్ పేరు
జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హాల్ : కాకతీయ ప్రాంగణం
అతిథులు బస చేసే ప్రాంగణం : సమ్మక్క -సారలమ్మ నిలయం
3న పేరేడ్ గ్రౌండ్ లో జరిగే మోడీ సభ : ‘విజయ సంకల్ప సభ’ అని పేరు
మీడియా పాయింట్ : సోయాబుల్లాఖాన్ పేరు
జాతీయ కార్యవర్గ సమావేశాల కార్యాలయం : భక్త రామదాసు పేరు
బీజేపీ ఫుల్ టైమర్ వర్కర్స్ సమావేశం : కొమురం భీం పేరు
భోజనశాల ప్రాంగణం : భాగ్యరెడ్డి వర్మ
జాతీయ కార్యవర్గ సమావేశాల తీర్మాణాల ప్రాంగణం : నిజాంపై పోరాటం చేసిన ‘నారాయణ పవార్’ పేరు
జాతీయ ప్రధాన కార్యదర్శులు నిర్వహించే మీటింగ్ హాలు : వందేమాతరం రామచంద్రరావు
జూలైలో 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు, సీఎంలు, పార్టీ ముఖ్య నేతలు రానున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేంద్ర బలగాలతో పాటు 8 వేల మంది రాష్ట్ర పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. దాదాపు 1,600 సీసీ కెమెరాలతో సిటీ మొత్తం నిఘా పెట్టారు. ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు మరింత పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.