విమానం టాయిలెట్ లో బంగారం  దాచి.. అక్రమంగా రవాణా

విమానం టాయిలెట్ లో బంగారం  దాచి.. అక్రమంగా రవాణా

చెన్నై: విమానం టాయిలెట్ లో 7 కిలోల బంగారం దాచి.. దుబాయ్ నుంచి అక్రమంగా తరలించుకుని వస్తున్న స్మగ్లర్ల గుట్టు రట్టు అయింది. టాలెట్లను శుభ్రం చేసే ప్రైవేటు కాంట్రాక్టు ఉద్యోగుల సహకారంతో అక్రమ రవాణా చేస్తూ… చెన్నై ఎయిర్ పోర్టులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. విమానాశ్రయంలోని మరుగుదొడ్లలో దాచి ఉంచిన 7 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి చెన్నై కి వచ్చిన జాక్ అస్సాచ్, సయ్యద్ ఇబ్రహీం భాషాలు బంగారాన్ని తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరికి విమానాశ్రయంలో లో ముగ్గురు ప్రైవేటు కాంట్రాక్టు ఉద్యోగులు సహకరించినట్లు గుర్తించారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ మూడు కోట్ల 60 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.