యాదగిరిగుట్ట, వెలుగు: పురుగుల మందు బదులు గడ్డి మందు స్ప్రే చేయడంతో నర్సరీలోని 1,500 మొక్కలు చనిపోయాయి. ఎంపీడీవో ఉమాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని నర్సరీలో పెంచుతున్న మొక్కలకు పురుగు పట్టింది. నర్సరీలో పనిచేస్తున్న వనసేవక్ విషయాన్ని విలేజ్ సెక్రటరీ ఆంజనేయులు దృష్టికి తీసుకెళ్లాడు. గ్రామపంచాయతీ బిల్డింగ్ లో పురుగుల మందు ఉందని, తీసుకెళ్లి స్ప్రే చేయమని ఆంజనేయులు చెప్పాడు. వనసేవక్ పొరపాటున పురుగుల మందు పక్కన ఉన్న గడ్డి మందు డబ్బాను తీసుకెళ్లి నర్సరీలో మొక్కలకు స్ప్రే చేశాడు. దీంతో మూడు బెడ్స్లోని మొక్కలు ఎండిపోయాయి. ఒక్కో బెడ్లో వెయ్యి మొక్కలు ఉంటాయని, దాదాపు 1500 మొక్కలు ఎండిపోయాయని ఎంపీడీవో చెప్పారు. ఉన్నతాధికారులకు రిపోర్ట్ సమర్పించామని, వారి ఆదేశాల ప్రకారం సంబంధిత ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామన్నారు.
పురుగుల మందు బదులు గడ్డి మందు కొట్టిన్రు
- తెలంగాణం
- July 8, 2022
లేటెస్ట్
- శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు....ఎప్పుడంటే..
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- మహిళ కిడ్నాప్ కేసు: జైలు నుంచి విడుదలైన రేవణ్ణ
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- కాంగ్రెస్ లోకి ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
- T20 World Cup 2024: నాయకుడిగా శాంటో.. ప్రపంచ కప్కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
- Nagarjuna In Coolie: కూలీకి సపోర్ట్గా కింగ్.. ఇది కదా క్రేజీ కాంబో అంటే!
- త్వరలో AC ధరలు పెరుగుతాయట..ఎందుకో తెలుసా..?
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!