ఆర్ఎస్ఎస్ కు రాజకీయాలతో సంబంధం లేదు

ఆర్ఎస్ఎస్ కు రాజకీయాలతో సంబంధం లేదు

నిజామాబాద్: రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ కు రాజకీయాలతో సంబంధంలేదని బీజేపీ జాతీయ నేత రాంమాధవ్ అన్నారు. నిజామాబాద్ లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు, శారీరకోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ సభ్యులు ప్రదర్శించిన దండయుద్ధ, ఆత్మరక్షణ, పద విన్యాసాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి రాంమాధవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని రాంమాధవ్ అన్నారు. . 100ఏళ్లుగా మంచి సమాజం కోసం సంఘ్ కృషి చేస్తోందన్నారు రాంమాధవ్. ఆర్టికల్ 370 తొలగిపోయిందని, అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతోందన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

ఢిల్లీ..బోణీ

ముల్తానీ మెరుపులు