సభ్యతగా మాట్లాడాలని చెప్పిన కస్టమర్తో ఓ సేల్స్ మెన్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో కస్టమర్ తల పగలగొట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్ హకీంపేటకు చెందిన ఓ మెగా మార్ట్ లో కస్టమర్ నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి వచ్చాడు.
ఈ క్రమంలో సేల్స్మెన్ అసభ్యంగా మాట్లాడాడని కస్టమర్యజమానికి చెప్పాడు. ఇరువురి మధ్య గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. ఆగ్రహానికి గురైన సేల్స్ మెన్ ఇనుప రాడ్తో కస్టమర్ తల పగలగొట్టాడు. ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.