దివ్యాంగుల చట్టాన్ని రాష్ట్ర సర్కార్‌‌‌‌ అమలు చేయాలి

దివ్యాంగుల చట్టాన్ని రాష్ట్ర సర్కార్‌‌‌‌ అమలు చేయాలి

ముషీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దివ్యాంగుల చట్టాన్ని రాష్ట్ర సర్కార్‌‌‌‌ అమలు చేయాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌‌లోని చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో బీజేవైఎం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భరత్ గౌడ్ సహకారంతో దివ్యాంగులకు నిత్యవ సర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దీనికి హాజరైన లక్ష్మణ్ సరుకులను పంపిణీ చేసి, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి దివ్యాంగులకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడంతో పాటు బడ్జెట్ కేటాయించిందన్నారు. కానీ, సీఎం కేసీఆర్ దివ్యాంగులను పెన్షన్‌‌ దారులగానే చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వారికి భృతి ఇచ్చినంత మాత్రాన సరిపోదని, విద్యా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌‌ చేశారు.