రాష్ట్రానికి కరువనేది రాదు

రాష్ట్రానికి కరువనేది రాదు
  • మారుమూల ప్రాంతాల అభివృద్ధికే జోనల్​ సిస్టమ్​
  • పోలీసులు అద్భుతంగా లా అండ్​ ఆర్డర్​ మెయింటేన్​ చేస్తున్నరు: సీఎం
  • మారుమూల ప్రాంత ఉద్యోగు లకు స్పెషల్​ అలవెన్స్​ ఇవ్వాలని సీఎస్​కు రివ్యూలో ఆదే

జనగామ, వెలుగు: తెలంగాణకు కరువనేదే రాదని సీఎం కేసీఆర్​ అన్నారు. ‘‘కరెంట్ సమస్య జన్మల కూడా రాదు. విద్యుత్ శాఖ ఉద్యోగులు అంకితభావంతో 24 గంటల కరెంటు వస్తున్నది” అని చెప్పారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధికే జోనల్​ సిస్టమ్​ తెచ్చామని, ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో చెప్పినట్లు ఉద్యోగులకు జీతాలు పెంచుకున్నామని, ఇంకా పెంచుకుందామని అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా కలెక్టరేట్​ కొత్త బిల్డింగ్​ను ప్రారంభించిన అనంతరం కాన్ఫరెన్స్​ హాల్​లో అధికారులు, ప్రజాప్రతినిధులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్​ మాట్లాడుతూ.. జిల్లాలను తమాషా కోసం ఏర్పాటు చేసుకోలేదని, స్పష్టమైన వైఖరితోనే చేశామని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ అలవెన్స్ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. చిన్న, చిన్న సమస్యలు వస్తే కొంపలు మునిగిపోవని అన్నారు.  హైదరాబాద్,  వరంగల్​కు మెయిన్​ కారిడార్​గా ఉన్న జనగామ జిల్లా అద్భుతంగా మారుతుందని, మంచి ఆశయాలతో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యాలయాలు గొప్ప ఫలితాలను ఇస్తాయని చెప్పారు. ఇతర రాష్ట్రాలు ఆశ్చర్యపడే స్థాయిలో తెలంగాణ ముందుకు పోతుందన్నారు. తెలంగాణ పోలీస్ అద్భుతంగా లా అండ్ ఆర్డర్ మెయింటెయిన్ చేస్తున్నదని ఆయన తెలిపారు. భయంకరమైన కరువు పరిస్థితులున్న జనగామ ఈరోజు అన్ని రంగాల్లో ముందుకొచ్చిందని, ఏడేండ్ల కింద జనగామ ఏరియాలో ఎకరం భూమి రూ. రెండు, మూడు లక్షలు ఉండేదని, ఇప్పుడు రెండు, మూడు, ఎక్కువ మాట్లాడితే నాలుగు కోట్లుందన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలు వరకు డిమాండ్ ఉందని చెప్పారు. ‘‘మన కలెక్టరేట్ తీరుగా చాలా రాష్ట్రాల్లో సెక్రటేరియట్ కూడా లేదు. జనగామలో ఇంత వైభవంగా కలెక్టరేట్​ కడుతమని జిందగీలో అనుకున్నమా. పదకొండు రాష్ట్రాల సీఎంలు వచ్చి మేం కూడా ఇలా కట్టుకుంటామని ముక్కుమీద వేలేసుకొని ఆశ్చర్య పోయారు” అని అన్నారు. కార్యక్రమంలో చీఫ్​ సెక్రటరీ సోమేశ్​ కుమార్​, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి , పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, పసునూరి దయాకర్  తదితరులు పాల్గొన్నారు.