అక్షయ్కుమార్(Akshay Kumar) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ మిషన్రాణిగంజ్(Mission Raniganj)..ది గ్రేట్ భారత్ రెస్క్యూ. ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలవనుంది. జనరల్ కేటగిరిలో ఇండిపెండెంట్గా ఈ చిత్ర బృందం నామినేషన్ వేసింది. గతంలో ఆర్ఆర్ఆర్ టీం కూడా ఇదే విధంగా ఇండిపెండెంట్గా కొన్ని కేటగిరీల్లో నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాణిగంజ్ మూవీకి సైతం ఆస్కార్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
1989లో పశ్చిమ బెంగాల్లోని రాణిగంజ్లోని బొగ్గు గనిలో 65మంది మైనర్లను కాపాడిన జశ్వంత్ సింగ్ గిల్(Jaswant Singh Gill) జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. టిను సురేశ్ దీనికి దర్శకుడు. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైన మిషన్ రాణిగంజ్ విమర్శల ప్రశంసలందుకున్న ఈ మూవీ..కమర్షియల్ సక్సెస్ను అందుకోలేకపోయింది. దీంతో అక్షయ్ కుమార్ ఫ్లాప్ చిత్రాల జాబితాలో మిషన్ రాణిగంజ్ మూవీ కూడా చేరిపోయింది.
ఈ మూవీలో అక్షయ్ కుమార్ జస్వంత్ పాత్రను పోషించగా..పరిణితి చోప్రా హీరోయిన్గా నటించింది. ఇందులో అక్షయ్ కుమార్ నటనకు ప్రశంసలు దక్కిన..సినిమా మాత్రం ఆడియన్స్ను ఆకట్టుకోలేకపోయింది. మరి ఆస్కార్ అవార్డు పోటీల్లో ఏ మేర సత్తా చాటుతుందో చూడాలి. ఆస్కార్ 2024 అధికారిక ఎంట్రీల కోసం పలు భారతీయ సినిమాలు పోటీ పడుతుండగా, జ్యూరీ అధికారికంగా మలయాళం బ్లాక్ బస్టర్ 2018 మూవీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.