
హైదరాబాద్ : మే18వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ నూతన సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కొత్త సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం ఇదే. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.