ఆదిలాబాద్​లో 42 డిగ్రీలు..22 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే నమోదు

ఆదిలాబాద్​లో 42 డిగ్రీలు..22 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే నమోదు
  • వచ్చే నాలుగు రోజుల్లో ఇంకో మూడు డిగ్రీలు పెరిగే చాన్స్
  • పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎండలు తీవ్రమయ్యాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల మార్క్​ను దాటాయి. మంగళవారం ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో 42 డిగ్రీలకు మించి టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఆరు జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 42 డిగ్రీల మధ్య నమోదు కాగా.. 14 జిల్లాల్లో 40 డిగ్రీల నుంచి 41 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

మొత్తంగా 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ కాగా.. మిగతా 11 జిల్లాల్లో 40లోపు నమోదయ్యాయి. మరోవైపు రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు దంచి కొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే ప్రమాదముందని వెల్లడించింది. పది జిల్లాలను ఆరెంజ్ అలర్ట్ జోన్​లో పెట్టింది. ఈ మేరకు మంగళవారం బులెటిన్​లో పేర్కొంది.

బుధవారం ఏడు జిల్లాలు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్​ను జారీ చేయగా.. మిగతా మూడు రోజులకు ఆ ఏడు జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్​ను ఇష్యూ చేసింది. అయితే, ఈ నెల 30, 31, వచ్చే నెల ఒకటో తేదీల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులకు సూచన చేసింది.

హైదరాబాద్​లో పొగమంచు

వేళల్లో మబ్బు పట్టి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో పాటు పొగమంచు పరిస్థితులుండే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా సాత్నాలలో 42.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రం భీం​ ఆసిఫాబాద్​లో 42 డిగ్రీలు రికార్డయింది. మంచిర్యాల జిల్లాలో 41.8, సూర్యాపేట, నల్గొండల్లో 41.7, నిజామాబాద్ 41.5, నిర్మల్​ 41.4, ములుగు 41.1, జగిత్యాల

సిద్దిపేటల్లో 40.9, కామారెడ్డి, వనపర్తిలలో 40.8, యాదాద్రి భువనగిరి 40.6, కరీంనగర్, మేడ్చల్​మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో 40.5, నాగర్​కర్నూల్ 40.4, వికారాబాద్, రాజన్నసిరిసిల్ల, మహబూబ్​నగర్ జిల్లాల్లో 40.3, భద్రాద్రి, నారాయణపేట జిల్లాల్లో 40.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మిగతా జిల్లాల్లో 40లోపు నమోదయ్యాయి.