పులుల చర్మం అమ్ముతున్నఅంతరాష్ట్ర ముఠా అరెస్ట్

పులుల చర్మం అమ్ముతున్నఅంతరాష్ట్ర ముఠా అరెస్ట్

 హైదరాబాద్:  పులులను సంహరించి దాని చర్మాన్ని, గోళ్లను అక్రమంగా అమ్ముతున్న  ఓ ముఠాను అరెస్ట్ చేశారు మల్కాజిగిరి ఎస్.ఓ.టి పోలీసులు.   స్మగ్లర్లు పులులను సంహరించి వాటి చర్మాన్ని ,గోళ్లను సుమారు 5 లక్షల రూపాయలకు వాటిని అమ్ముతున్నారని తెలిపారు.  ఎల్బీ నగర్ పోలీసులకు అందిన సమాచారంతో మల్కాజిగిరి ఎస్.ఓ.టి పోలీసుల సహాయంతో ఈ నలుగురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసి వారి వద్దనుండి పులి చర్మాన్ని, నాలుగు గోళ్లను స్వాదీనం చేసుకున్నారు.

 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..ఒడిశా , ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నలుగురు ఓడిశా అడవుల్లో తిరుగుతున్న పులిని చంపి దాని చర్మాన్ని హైదరాబాద్ లో అమ్మడానికి తీసుకొచ్చిన్నట్లు సమాచారం అందిన ఎస్వోటి పోలీసులు చర్మాన్ని కొనేవారి లాగా స్మగ్లర్లతో బేరం చేసి వారి వద్ద ఉన్న చర్మాన్ని , గోళ్లను స్వాదీనం చేసుకున్నారు. ఈ అపరేషన్లో పాల్గొన్న పోలీసులకు క్యాష్ ప్రైజ్ అందజేస్తామని రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ చెప్పారు.