ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు వేగవంతం

ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు వేగవంతం

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.రొమేనియా నుంచి మొదటి విమానం ముంబై బయల్దేరిందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ప్రకటించారు.విమానంలో మొత్తం 219 మంది ఉన్నారని తెలిపారు. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతుందని, తాను స్వయంగా ఈ విషయాన్ని పర్యవేక్షిస్తున్నానని స్పష్టం చేశారు.రొమేనియా నుంచి బయల్దేరిన విమానం సాయంత్రం ఆరున్నరకు ముంబైలో దిగనుంది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులందరినీ తరలిస్తున్నామన్నారు అధికారులు. అక్కడ చిక్కుకున్న భారతీయులతో మాట్లాడుతున్నామని, వారిని స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు రొమేనియాలోని భారత రాయబారి రాహుల్ శ్రీ వాస్తవ.

మరిన్ని వార్తల కోసం

 

ఉక్రెయిన్‎కు మద్దతివ్వొద్దన్నారు.. కానీ మేమిస్తాం

రష్యా సైనికులను నిలదీసిన ఉక్రెయిన్ మహిళ