
‘ద కశ్మీర్ ఫైల్స్’ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి నుండి రాబోతున్న చిత్రం . ‘ద వ్యాక్సిన్ వార్’. అభిషేక్ అగర్వాల్ సమర్పణలో పల్లవి జోషి నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ను బుధవారం లక్నోలో ప్రారంభించారు. కొవిడ్ వ్యాక్సిన్ను కనిపెట్టే క్రమంలో బయో సైంటిస్టులు ఎదుర్కొన్న స్ట్రగుల్స్ మొదలు వాళ్ల సక్సెస్ వరకూ ఇందులో చూపించబోతున్నారు.
‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ రాసిన ‘గోయింగ్ వైరల్.. మేకింగ్ ఆఫ్ కో వ్యాక్సిన్’ అనే బుక్ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు వివేక్. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఇంగ్లీష్తో పాటు 11 భాషల్లో దీన్ని విడుదల చేయబోతున్నారు.