
- నిందితుడిని అరెస్ట్ చేసిన కామారెడ్డి పోలీసులు
- కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, వెలుగు: మర్డర్ చేసి బెయిల్ కోసం అప్పు చేయగా.. ఆ పైసలు ఎగ్గొట్టేందుకు మరో మహిళను చంపేసిన నిందితుడిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ రాజేశ్ చంద్ర శుక్రవారం మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. కామారెడ్డి మండలం నర్సన్పపల్లికి చెందిన చిదుర కవిత(44)గత నెల 30న హత్యకు గురైంది. ఆమె భర్త గంగారెడ్డి ఫిర్యాదుతో దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఎస్పీ పర్యవేక్షణలో రూరల్సీఐ రామన్, ఎస్ఐ రాజు, క్రైం టీమ్దర్యాప్తు చేపట్టింది. సీసీ ఫుటేజ్ లను పరిశీలించి దోమకొండ మండలం చింతమాన్పల్లికి చెందిన పాత నేరస్తుడు జంగంపల్లి మహేశ్ను అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడిగా తేలింది.
మహేశ్ కొద్ది రోజుల కింద బిక్కనూర్ పీఎస్ పరిధిలో వ్యక్తిని హత్య చేసి జైలుకు వెళ్లాడు. బెయిల్ కోసం కవిత వద్ద నిందితుడు రూ. 1 లక్ష అప్పు చేశాడు. ఆ పైసలు ఇవ్వమని ఆమె అడిగింది. దీంతో చంపేస్తే అప్పు ఎగ్గొట్టవచ్చని మహేశ్ప్లాన్ చేశాడు. అప్పు పైసలు ఇస్తానని కవితకు ఫోన్చేసి వ్యవసాయ భూమి వద్దకు పిలిచాడు. నమ్మి వెళ్లిన ఆమెను ముక్కుపై బలంగా కొట్టి.. చీర కొంగుతో మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు కమ్మలు, మాటీలు, ఉంగరం, సెల్ ఫోన్ తీసుకొని పారిపోయాడు. నిందితుడి వద్ద మృతురాలి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మర్డర్ కేసును 48 గంటల్లోనే ఛేదించిన సీఐ, ఎస్ఐ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.