పోలీస్ గల్లా పట్టుకున్న యువకుడు.. మద్యం మత్తులో వీరంగం

పోలీస్ గల్లా పట్టుకున్న యువకుడు.. మద్యం మత్తులో వీరంగం

మద్యం మత్తులో  ఓ యువకుడు పోలీస్​గల్లా పట్టుకున్న సంఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన నాగరాజు మద్యం సేవించాడు. 

అనంతరం రోడ్డుపై అటుగా వెళ్తున్న ఓ కారును బలవంతంగా ఆపి వాటి అద్దాలు పగలగొట్టి వీరంగం సృష్టించాడు. కారులో ఉన్న వారిని భయబ్రాంతులకు గురి చేశాడు. దీంతో ప్రయాణికులు పోలీసుకులకు సమాచారం ఇచ్చారు. 

అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో యువకుడు బూతులు మాట్లాడుతూ.. హెడ్​ కానిస్టేబుల్​ గల్లా పట్టుకున్నాడు. ఈ ఘటనతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అతన్ని అక్కడి నుంచి పోలీస్​స్టేషన్​కి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.