- యువకుడిపై న్యూసెన్స్ కేసు
నారాయణ్ ఖేడ్, వెలుగు: పేరెంట్స్ తనకు సరైన పేరు పెట్టలేదంటూ 100కు డయల్చేసి ఫిర్యాదు చేసిన యువకుడిపై పోలీసులు న్యూసెన్స్ కేసు పెట్టారు. ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం కిషన్ నాయక్ తండాకు చెందిన కర్ర సురేశ్(23) శనివారం రాత్రి 100కు ఫోన్ చేశాడు.
తనకు తల్లిదండ్రులు సరైన పేరు పెట్టనందున అనేక కష్టాలు ఎదుర్కొంటున్నానని చెప్పాడు. తన తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఫిర్యాదు చేసిన వ్యక్తిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. డయల్ 100 అత్యవసర సమయాల్లోనే ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు.