- సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్వి అంటున్న పోలీసులు
- అతడు ఫొటో తీసి పంపిస్తే రవి వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నడట!
మంచిర్యాల, వెలుగు: చెన్నూర్కు చెందిన కొప్పుల రవి అనే సింగరేణి కార్మికుడు బుల్లెట్లను ‘జై బాల్క సుమన్’ ఆకారంలో పేర్చి తన వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం కలకలం రేపింది. ప్రస్తుతం సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేస్తున్న రవి ఏకే 47లో ఉపయోగించే 64 బుల్లెట్లను ఇంగ్లిష్ అక్షరాలుగా పేర్చి ఉన్న ఫొటోను స్టేటస్గా పెట్టుకున్నాడు. అది చూసినవాళ్లు ఫొటోను స్ర్కీన్షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో అన్ని బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న ప్రశ్న తలెత్తింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రవి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. దీంతో ఈ విషయంపై పోలీసులు ఆరా తీశారు.
చెన్నూర్ మహంకాళివాడకు చెందిన సంతోష్ ..బీజాపూర్లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడని, అతడు బుల్లెట్లను అక్షరాలుగా పేర్చి ఫొటో తీసి పట్టణానికి చెందిన తన ఫ్రెండ్ సంతోష్ కు పంపగా.. కొప్పుల రవి స్టేటస్గా పెట్టుకున్నాడని సీఐ ప్రవీణ్కుమార్ చెప్పారు. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంతోష్, కొప్పుల రవి ఇద్దరూ బాల్క సుమన్ అభిమానులని తెలిసిందన్నారు. సుమన్తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్నారని, ఇటీవల వారిపై దాడికి రెక్కీ నిర్వహించారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కొప్పుల రవి బుల్లెట్లతో ‘జై బాల్క సుమన్’ అని ఉన్న ఫొటోను స్టేటస్గా పెట్టుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది.