
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఏదైనా నిర్ణయం తీసుకుంటే అత్యున్నత సమగ్ర ప్రమాణాలు, నైతికత పాటించాలని దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ చేతనా నంద్ సింగ్ సూచించారు.
సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో శనివారం ‘స్టే ఎథికల్లీ విజిలెంట్ ఆల్వేస్’ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ కార్పొరేట్ కోచ్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ హిమాన్షు విష్ణోయ్ ఉపన్యాసం ఆకట్టుకుంది. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ సత్యప్రకాశ్, ప్రధాన విభాగాధిపతులు, డివిజనల్ రైల్వే మేనేజర్లు పాల్గొన్నారు.