రిపబ్లిక్ డే వేడుకలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ 

రిపబ్లిక్ డే వేడుకలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ 

విదేశీ అతిథి సమక్షంలో భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.  అయితే  ఈ ఆచారానికి ఈసారి బ్రేక్ పడింది. ఈ సారి జరుపుకునే జనవరి 26 వ తేదీన జరుపుకునే రిపబ్లిక్ డే వేడుకలకు అతిథులను ఎవరినీ ఆహ్వానించడం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్నందున్న ఈసారి గెస్టులను ఆహ్వానించడం లేదని తెలిపింది. కొవిడ్ వ్యాప్తి పెరుగుదల నేపథ్యంలో కజాకిస్తన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ నాయకులకు న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వడం లేదని తెలిసింది.

గతేడాది కూడా ముఖ్య అతిథులు ఎవరూ లేకుండానే భారత్ రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి.

మరిన్ని వార్తల కోసం...

 

హామీల పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేశారు