మహారాష్ట్రకు ఒక్క అంగుళం కూడా ఇయ్యం :డీకే శివకుమార్ 

మహారాష్ట్రకు ఒక్క అంగుళం కూడా ఇయ్యం :డీకే శివకుమార్ 

బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు హైకమాండ్ ముందు మాట్లాడే ధైర్యం ఉండదని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి ఇంకా ప్రతినిధి బృందంతో వెళ్లలేదని విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. 

మహారాష్ట్రకు ఒక్క గ్రామం కాదు కదా.. ఒక్క అంగుళం భూమి కూడా ఇవ్వమని  డీకే శివకుమార్ తేల్చిచెప్పారు. సరిహద్దు సమస్యపై బీజేపీ నేతలు దాగుడు మూతలు ఆడుతున్నారని ఆరోపించారు. అసలు సరిహద్దు సమస్య లేదని.. రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే ఉందని.. వారి ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వమే సమస్యను పరిష్కరించాలని సూచించారు. అలా చేయకుండా ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.