గుప్త నిధుల కోసమే సీక్రెట్ గా కూల్చుతున్నరు

గుప్త నిధుల కోసమే సీక్రెట్ గా కూల్చుతున్నరు

టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు వాటిని దోచుకుంటరు: ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్ లోని పాత బ్లాకుల కింద గుప్త నిధులు ఉన్నాయని అందరూ అంటున్నారని, వీటిని టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు దోచుకునేందుకే రహస్యంగా కూల్చి వేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. దీని వెనక పెద్ద కుట్ర ఉందన్నారు. అవసరం లేకున్నారూ.600 కోట్ల ప్రజాధనంతో కొత్త సెక్రటేరియట్ కడుతున్నారని చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. గతంలో ఏ కట్టడాలు కూల్చి వేసినా మీడియాను, ఇతర పార్టీ నేతలను అనుమతించే వారని, గుప్త నిధులు దోచుకునేందుకే పోలీసు సెక్యూరిటీ పెట్టి కూల్చి వేస్తున్నారని ఆరోపించారు. సెక్రటేరియట్ కూల్చి వేత కవరేజీకి మీడియాను అనుమతించటంలేదని హైకోర్టులో పిటిషన్ వేయటం మంచి పరిణామమని చెప్పారు. కూల్చివేత పరిణామాలను ప్రజలు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం