
యాదాద్రి, వెలుగు : ఉప ఎన్నికలో సోషల్మీడియాను ఎవరికి నచ్చినట్టు వారు వాడుకుంటున్నారు. వాట్సాప్లో అయితే మరీ క్రియేటివిటీ ప్రదర్శిస్తున్నారు. ఒక వాట్సాప్చాటింగ్లో ఓటర్లను టీఆర్ఎస్కు ఓటు వేయాలని అభ్యర్థించినట్టు ఒక వీడియో, మంత్రి కేటీఆర్ను లీడర్గా చూపిస్తూ మరో వీడియో పోస్ట్ చేశారు. 'మునుగోడు ఓటర్' పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్టుగా మొదటి వీడియో రూపొందించారు. ఈ వీడియోలో ఇద్దరు చాట్ చేసినట్టుగా ఉంటుంది.
'నమస్తే'తో మొదలై..' ఎలక్షన్లో టీఆర్ఎస్ కు ఓటు వేయండి అని కోరడం..బదులుగా ‘ఎందుకు వెయ్యాలి? వేస్తే మాకేంటి లాభం?’ అని ఓటరు రిప్లై ఇవ్వడం, తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫొటోలను పెట్టడం, చివరగా ఆ ఓటరు ‘ఓకే ఓకే వేస్తాను అని అనడంతో పాటు ‘మా తెలంగాణ మా కేసీఆర్’ అనడంతో వీడియో ముగుస్తుంది. ఇందులో పోస్ట్ చేసిన పథకాల్లో ఆగిపోయిన ‘కంటి వెలుగు' స్కీంను కూడా పెట్టారు. రెండో వీడియోలో మంత్రి కేటీఆర్ను లీడర్గా చూపిస్తూ ఓటు వేయాలని కోరినట్టుగా పోస్ట్ చేశారు.