కహ్రామన్మారస్(టర్కీ): వాళ్లు ముగ్గురు మృత్యుంజయులు. ఒకట్రెండు కాదు.. ఏకంగా వందల గంటల పాటు భవన శిథిలాల కిందే బిక్కుబిక్కుమంటూ గడిపి.. బతికి బయటపడ్డారు. టర్కీలోని కహ్రామన్ మారస్ నగరానికి చెందిన ఈ ముగ్గురినీ రెస్క్యూ సిబ్బంది గురువారం కాపాడారు. 10 రోజుల కింద భూకంపం రావడంతో కూలిన అపార్ట్మెంట్ శిథిలాల కింద అబ్దుల్ బఖీ యెనినార్(21), మహ్మద్ ఎనెస్ యెనినార్ (17) అనే అన్నదమ్ములు ఇరుక్కుపోయారు. దాహాన్ని తీర్చుకునేందుకు మూత్రం తాగారు. ఆకలిని తీర్చుకునేందుకు శిథిలాల నడుమ దొరికిన ప్రోటీన్ పౌడర్ను తిన్నారు. ఏదోలా దాదాపు 200 గంటలు (9 రోజులు) శిథిలాల నీడలో గడిపి.. చివరకు ఫిబ్రవరి 14న రెస్క్యూ టీమ్స్ వచ్చి హెల్ప్ చేయడంతో బతికి బయటపడ్డారు. ఆ తర్వాత వారు జరిగిందంతా మీడియాకు చెప్పడంతో విషయం వెలుగుచూసింది. ఇటువంటిదే మరో ఘటన ఇదే నగరంలో చోటుచేసుకుంది. దాదాపు 248 గంటల పాటు (10 రోజులు) భవన శిథిలాల కింద చిక్కుకున్న 17 ఏళ్ల అమ్మాయిని రెస్క్యూ టీం బయటికి తీసింది. కాగా, భూకంపం వల్ల టర్కీ, సిరియాల్లో మరణించిన వారి సంఖ్య 42వేలు దాటింది. మృతుల్లో 36,187 మంది టర్కీవాసులు కాగా, 5,800 మంది సిరియావాసులు. టర్కీలో 1.08 లక్షల మంది గాయాలపాలయ్యారు.
9 రోజులు శిథిలాల కిందే..యూరిన్ తాగి బతికిన్రు
- విదేశం
- February 17, 2023
లేటెస్ట్
- RCB vs KKR: కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే..?
- పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభం... షెడ్యూల్ ఇదే
- Mad Sequel: మ్యాడ్ సీక్వల్ టైటిల్ రివీల్..షూటింగ్ ఎప్పుడో చెప్పిన డైరెక్టర్!
- భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
- రైతు బంధుపై చర్చకు సిద్ధం:భట్టి విక్రమార్క
- ఎమ్మెల్యే సంజయ్ తండ్రి మృతి పట్ల కేసీఆర్ సంతాపం
- RCB vs KKR: ఇంత మతి మరుపా..కన్ఫ్యూజన్లో టీంను మర్చిపోయిన అయ్యర్
- ప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్
- కాంగ్రెస్ లోకి కేటీఆర్ అనుచరుడు?
- కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని మరో పిల్
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?