మంచిర్యాల జిల్లా నెన్నెల గ్రామీణ బ్యాంకులో దోపిడీకి దొంగ విఫలయత్నం
ఏమీ దొరక్కపోవడంతో పేపర్పై రాసి పోయిండు
బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీ ణ బ్యాంకులో గురువారం అర్ధరాత్రి ఓ దొంగ దోపిడీకి విఫలయత్నం చేశాడు. ప్రధాన గేట్నుంచి కాకుండా మరో తలుపు తాళం పగలగొట్టి బ్యాంకులోకి ప్రవేశించిన దొంగకు ఒక్క రూపాయి కూడా దొరకలేదు. స్ట్రాంగ్రూమ్తాళాలు తెరిచేందుకు ప్రయత్నించినా వల్ల కాలేదు. ఇదంతా సీసీ టీవీల్లో రికార్డయ్యింది. ఉదయం డ్యూటీకి వచ్చిన స్వీపర్తలుపు తాళాలు పగలగొట్టి ఉండటంతో మేనేజర్కు సమాచారం ఇచ్చింది.
మేనేజర్ ఫిర్యాదు మేరకు ఎస్సై శ్యాంపటేల్ బ్యాంకుకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. బెల్లంపల్లి ఏసీపీ సదయ్య బ్యాంకుకు వచ్చి క్లూస్టీమ్తో ఆధారాలు సేకరించారు. అయితే, దొంగ పోతూపోతూ...బ్యాంకు గురించి ఓ పేపర్పై ‘ గుడ్ బ్యాంక్, ఒక్క రూపాయి కూడా దొరకలేదు. నన్ను పట్టుకోవద్దు. నా ఫింగర్ ప్రింట్ కూడా దొరకదు. ’ అంటూ రాశాడు. దర్యాప్తు చేస్తున్నామని నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు.