అయ్యో పాపం అనుకునేలోపే..దొంగ అని తేలింది!

అయ్యో పాపం అనుకునేలోపే..దొంగ అని తేలింది!
  • సెల్​ఫోన్ల దొంగను పట్టించిన రోడ్డు ప్రమాదం

గండిపేట, వెలుగు: ఆరు సెల్‌‌ఫోన్లు కొట్టేసి పారిపోతున్న దొంగ రోడ్డు ప్రమాదానికి గురై పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధి హైదర్షాకోట్‌‌లో జరిగింది. వికారాబాద్​జిల్లా పరిగి మండలం మాల్కాపురం గ్రామానికి చెందిన మహేశ్ చోరీలకు అలవాటు పడ్డాడు. శనివారం హైదర్షాకోట్​ఏరియాలో మొత్తం 6 సెల్​ఫోన్లు కొట్టేశాడు. వాటిని జేబులో పెట్టుకుని వెళ్తూ రోడ్డు దాటుతుండగా బైక్​ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్​గాయపడ్డాడు. 

అయ్యో పాపం అంటూ స్థానికులు అతన్ని కాపాడేందుకు దగ్గరకు వెళ్లగా, అతని జేబులో నుంచి పడిపోయిన 6 సెల్​ఫోన్లు కనిపించాయి. దొంగ అని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నార్సింగి పోలీసులు అక్కడికి చేరుకుని సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మహేశ్​ను స్టేషన్‌‌కు తరలించి కేసు నమోదు చేశారు.