లిక్కర్ షాపులో దొంగతనం

లిక్కర్ షాపులో దొంగతనం
  • అశ్వారావుపేటలోని వైన్స్​లో చోరీ
  • రూ. లక్షన్నర లిక్కర్​ మాయం

అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రం శివారులోని వైన్​షాపులో దొంగలు పడ్డారు. లక్షన్నర విలువ చేసే బ్రాండెడ్​ లిక్కర్ ​బాటిల్స్​ను ఎత్తుకెళ్లారు. షాప్​ఓనర్​వివరాల ప్రకారం.. అశ్వారావుపేట శివారు ఊట్లపల్లి రోడ్డులోని వైన్​షాప్​లోకి గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. ముందు వైపు సీసీ కెమెరాలు ఉండడంతో షాప్​వెనుక గోడకు రంధ్రం చేసి లోనికి ప్రవేశించారు. ముందుగా సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేశారు. తర్వాత అక్కడ ఉన్న బ్రాండెడ్​ లిక్కర్​బాటిల్స్ ను ఎత్తుకెళ్లారు. చోరీ చేసిన బాటిల్స్​అట్టపెట్టలను షాపు వెనుక కుప్పగా వేసి బాటిల్స్​ పట్టుకెళ్లారు. ఇదే షాపులో నెల కింద చోరీ జరిగింది. అప్పుడు కేవలం మ్యాన్షన్ ​హౌస్ బాటిల్స్​ను మాత్రమే దొంగిలించారు. శుక్రవారం నిర్వాహకులు షాపు ఓపెన్​ చేసేసరికి బీరు బాటిల్స్ అట్టపెట్టెలు చిందరవందరగా పడి ఉన్నాయి. మరోసారి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొత్తగూడెం క్లూస్ టీం వివరాలు సేకరించింది.