- అశ్వారావుపేటలోని వైన్స్లో చోరీ
- రూ. లక్షన్నర లిక్కర్ మాయం
అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రం శివారులోని వైన్షాపులో దొంగలు పడ్డారు. లక్షన్నర విలువ చేసే బ్రాండెడ్ లిక్కర్ బాటిల్స్ను ఎత్తుకెళ్లారు. షాప్ఓనర్వివరాల ప్రకారం.. అశ్వారావుపేట శివారు ఊట్లపల్లి రోడ్డులోని వైన్షాప్లోకి గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. ముందు వైపు సీసీ కెమెరాలు ఉండడంతో షాప్వెనుక గోడకు రంధ్రం చేసి లోనికి ప్రవేశించారు. ముందుగా సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేశారు. తర్వాత అక్కడ ఉన్న బ్రాండెడ్ లిక్కర్బాటిల్స్ ను ఎత్తుకెళ్లారు. చోరీ చేసిన బాటిల్స్అట్టపెట్టలను షాపు వెనుక కుప్పగా వేసి బాటిల్స్ పట్టుకెళ్లారు. ఇదే షాపులో నెల కింద చోరీ జరిగింది. అప్పుడు కేవలం మ్యాన్షన్ హౌస్ బాటిల్స్ను మాత్రమే దొంగిలించారు. శుక్రవారం నిర్వాహకులు షాపు ఓపెన్ చేసేసరికి బీరు బాటిల్స్ అట్టపెట్టెలు చిందరవందరగా పడి ఉన్నాయి. మరోసారి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొత్తగూడెం క్లూస్ టీం వివరాలు సేకరించింది.