హైదరాబాద్–విజయవాడ హైవేపై భారీ చోరీ.. టిఫిన్ చేస్తుండగా రూ.9 లక్షల బ్యాగ్ ఎత్తుకెళ్లిన దొంగలు

 హైదరాబాద్–విజయవాడ హైవేపై భారీ చోరీ..  టిఫిన్ చేస్తుండగా రూ.9 లక్షల బ్యాగ్ ఎత్తుకెళ్లిన దొంగలు

నార్కట్​పల్లి, వెలుగు: హైదరాబాద్–విజయవాడ హైవేపై నార్కట్ పల్లి శివారులోని పూజిత హోటల్  వద్ద రూ.9 లక్షల బ్యాగును ఆదివారం ఉదయం దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటకు చెందిన మోటార్​ మెకానిక్​ ఆరే రవీందర్ రెడ్డి ఆదివారం ఉదయం ఖమ్మం నుంచి ఆర్టీసీ బస్సులో తన బావమరిది కొండూరు సంతోష్ రెడ్డితో కలిసి హైదరాబాద్​ బయలుదేరాడు. 

8 గంటల సమయంలో నార్కట్ పల్లి శివారులోని పూజిత హోటల్  వద్ద టిఫిన్  చేయడానికి బస్సు ఆపారు. రవీందర్ రెడ్డి టిఫిన్  చేస్తుండగా, ఓ వ్యక్తి పక్కకు వచ్చి బ్యాగ్​ను లాక్కొని కారు ఎక్కి హైదరాబాద్  వైపు పరారయ్యాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు టీమ్​లు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు ఎస్సై విష్ణుమూర్తి తెలిపారు. కాగా, పూజిత హోటల్  వద్ద గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.