దొంగలు బీభత్సం.. బస్సులో ప్రయాణికుల బ్యాగులు చోరీ

దొంగలు బీభత్సం..  బస్సులో ప్రయాణికుల బ్యాగులు చోరీ

TSRTCలో దొంగలు బీభత్సం సృష్టించారు.  లహరి బస్సులో ప్రయాణికుల బ్యాగులు చోరీ చేశారు.  షిరిడి నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికులు..  మియాపూర్ లో బస్సు దిగి చూసేసరికి బ్యాగులు మాయమయ్యాయి.  బ్యాగుల్లో సెల్ ఫోన్లు, నగదు ఉన్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.  దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తు్న్నారు.