ఇండియాతో కలిసిబిజినెస్​పై ఆలోచిస్తున్నం : ఇషాక్ దార్

ఇండియాతో కలిసిబిజినెస్​పై ఆలోచిస్తున్నం : ఇషాక్ దార్
ఇస్లామాబాద్: ఇండియాతో వాణిజ్యపరమైన సంబంధాలు పునరుద్ధరించేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ఆలోచిస్తున్నదని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మహ్మద్ ఇషాక్ దార్ తెలిపారు. 2019, ఆగస్టు నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు నిలిచిపోయాయని చెప్పారు. బ్రస్సెల్​లో నిర్వహించిన న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్​కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్​లో ఇషాక్ మాట్లాడారు.

 ‘‘ఇండియాతో వ్యాపారపరమైన సంబంధాలు మళ్లీ ప్రారంభించాలని పాకిస్తాన్​కు చెందిన ప్రతి వ్యాపారవేత్త కోరుకుంటున్నాడు. ఈ విషయమై మా ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిశీలిస్తున్నది. ఇండియా విషయంలో పాకిస్తాన్ దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. కాశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇండియాతో పాకిస్తాన్ వాణిజ్య సంబంధాలు తెంచుకున్నది. ఆర్టికల్ 370 రద్దును ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేసింది.