- టీకా మూడో డోసుకు యూఎస్ ఓకే
- ఇమ్యూనిటీ తక్కువున్నోళ్లకే..
అమెరికా: కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్న సమయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్లకు టీకా మూడో డోసు ఇవ్వాలని నిర్ణయించింది. రెండు డోసులు తీసుకున్న తరువాత కూడా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న వాళ్లకు ఫైజర్, మొడెర్నా వ్యాక్సిన్ ఇవ్వడానికి అధికారులు శుక్రవారం పర్మిషన్ ఇచ్చారు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుని, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ముందు తీసుకున్న రెండు డోసులకు అదనంగా మరో డోసు ఇవ్వడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) అంగీకరించింది. ఎమర్జెన్సీ వాడకానికి ఉన్న రూల్స్ను
- సవరించింది.