సిరీస్ ఓటమితో ధోనీ రికార్డ్ సమం

సిరీస్ ఓటమితో ధోనీ రికార్డ్ సమం

బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత్ 0-2తో  సిరీర్ కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ సిరీస్ ఓటమితో రోహిత్ శర్మ కేప్టెన్సీలో చెత్త రికార్డ్ నమోదయింది. బంగ్లాదేశ్ వేదికపై వన్డే సిరీస్ కోల్పోయిన రెండో భారత కేప్టెన్ గా రోహిత్ శర్మ పేరు నమోదయింది. మహేంద్ర సింగ్ ధోనీ రోహిత్ కన్నా ముందువరుసలో ఉన్నాడు. 

2015లో ధోనీ నాయకత్వంలో బంగ్లా టూర్ కి వెళ్లిన టీం ఇండియా 1-2తో సిరీస్  కోల్పోయింది. అయితే, నిన్న జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ పోరాటం మాత్రం చిరస్మరణీయం. రెండో ఓవర్లో గాయం వల్ల మ్యాచ్ కు దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చినా, అదేది లెక్కచేయకుండా చివరి నిమిషంలో క్రీజ్ లోకి వచ్చి మ్యాచ్ ని గెలిపించినంత పనిచేశాడు.