- మే 17 నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. మే 27 నుంచి సెలవులు
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని బడుల్లో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మే 26 వరకు ఫిజికల్ క్లాసులు జరగనున్నాయి. మే17 నుంచి 26 వరకు టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. తొమ్మిది, పదో తరగతి క్లాసులకు సంబంధించి 2020–21 అకడమిక్ క్యాలెండర్ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చిత్రారాంచంద్రన్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో స్టేట్లెవెల్ లో ఇన్స్పైర్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ఫిబ్రవరిలో ఇప్పటివరకు జరిగిన పాఠాలను ఆన్ లైన్ లో రివిజన్ చేస్తారు. మార్చి, ఏప్రిల్నెలల్లో తొమ్మిది, పదో తరగతి స్టూడెంట్స్కు రెండు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) ఎగ్జామ్స్పెడతారు. తొమ్మిదో క్లాస్ స్టూడెంట్స్కు మే 7 నుంచి 13 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ), అదే నెల 26న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి రిజల్ట్ ప్రకటిస్తారు. మే 17 నుంచి 26 వరకు టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. టెన్త్లో ఆరు సబ్జెక్టులకు గాను ఆరు పేపర్లకు ఎగ్జామ్స్ పెట్టాలని నిర్ణయించారు. మే 27 నుంచి జూన్13 వరకు 8 రోజులపాటు స్కూళ్లకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2021-=22 అకడమిక్ ఇయర్ జూన్ 14 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. సెప్టెంబర్ 1 నుంచి జనవరి 30 వరకు 115 రోజులపాటు ఆన్లైన్క్లాసులు, ఆ తర్వాత 89 రోజులు ఆఫ్లైన్ లో పాఠాలు చెప్తామని అకడమిక్ క్యాలెండర్లో పేర్కొన్నారు.
ఎగ్జామ్స్ కు 70 శాతం సిలబస్..
70 శాతం సిలబస్నే టీచర్లు పరిగణలోకి తీసుకుని బడుల్లో,ఆన్లైన్లో పాఠాలు చెప్తారని ప్రభుత్వం తెలిపింది. మిగిలిన 30శాతం సిలబస్ నుంచి టీచర్లు, పేరెంట్స్ గైడెన్స్లో ప్రాజెక్ట్ వర్క్, అసైన్మెంట్లు నిర్వహిస్తారు. 9,10 క్లాసుల ఎగ్జామ్స్కు స్టూడెంట్స్ కు అటెండెన్స్తప్పనిసరి కాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్టూడెంట్స్ బడులకు రావాలంటే పేరెంట్స్ నుంచి పర్మిషన్ లెటర్ తీసుకురావాలన్నారు. స్కూల్స్ ఓపెన్ చేయడానికి ముందేఎస్ఎంసీ, పేరెంట్స్ మీటింగ్తప్పనిసరిగా పెట్టాలని, దీంట్లో కోవిడ్, ఇమ్యూనిటీ డెవలప్మెంట్, ఫిజికల్ డిస్టెన్స్తదితర అంశాలపై అవేర్నెస్ కల్పించాలని సూచించారు.
బడుల్లో యోగా…
స్కూళ్లు ప్రారంభమయ్యాక పిల్లల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు సింపుల్ యోగా ఎక్సర్ సైజ్తప్పనిసరిగా చేయించాలి. పిల్లల్లో అలసట, ఒత్తిడి తగ్గించేందుకు కో కరికూలమ్ యాక్టివిటీస్ నిర్వహించాలి. మ్యాథ్స్గేమ్స్, వర్డ్స్అంత్యాక్షరి తదితర కార్యక్రమాలు నిర్వహించాలి. పిల్లలకు రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించాలి. స్టాఫ్, స్టూడెంట్స్కు వేర్వేరుగా ఐసోలేషన్ రూమ్స్ఏర్పాటు చేయాలి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
స్కూల్ టైమింగ్స్
జిల్లాలు: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 గం.ల వరకు
జంటనగరాలు: ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 గం.ల వరకు
ఆన్లైన్ క్లాసులు
టెన్త్: ఉదయం 10 నుంచి 11 గం.ల వరకు రెండు పీరియడ్లు
తొమ్మిదో తరగతి: సాయంత్రం 4 నుంచి 5 గం.ల వరకు రెండు పీరియడ్లు
ఎగ్జామ్స్ షెడ్యూల్
మార్చి15 లోగా: 9,10 క్లాసులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-1
ఏప్రిల్15 లోగా: 9,10 క్లాసులకు ఫార్మేటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ) -2
మే 7 – మే13 : 9వ తరగతికి సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)
మే 17- మే 26 : టెన్త్ ఎగ్జామ్స్.