అంతర రాష్ట్ర ప్రయాణాలకు ప్రత్యేక పాసులు అవసరం లేదు

అంతర రాష్ట్ర ప్రయాణాలకు ప్రత్యేక పాసులు అవసరం లేదు

ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు ఇకనుండి డీ.జీ.పీ.కార్యాలయం నుండి పాసులు తీసుకొవాల్సిన అవసరం లేదని తెలిపారు పోలీసు అధికారులు. అయితే తెలంగాణ రాష్ట్రం నుండి ఆంద్ర ప్రదేశ్, కర్ణాటక, మహరాష్ట్ర రాష్ట్రాలకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్ లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు అంతరాష్ట్ర ప్రయాణాలకు డీ.జీ.పీ కార్యాలయం నుండి ప్రత్యేకంగా పాసులు జారీ చేసేదన్నారు.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తి వేస్తూ అంతర రాష్ట్ర ప్రయాణాలకు అనుమతిస్టూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో.. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణాలకు ట్రాన్స్ పోర్ట్ పాసులను జారీ చెయడాన్ని పోలీసు శాఖ నిలిపి వేసింది. తెలంగాణాకు వచ్హే వాహనాలకు కూడా వాహన పాసులను అడగడం లేదు. అయితే, ఆంద్రప్రదేశ్ కు వెళ్లాల్సిన వారు స్పందన యాప్ లో, కర్ణాటక రాష్ట్రానికి వెళ్లేవారు.. ఆ రాస్ట్రానికి చెందిన సేవా యాప్ లోనూ, మహరాష్ట్రకు వెళ్లే వారు, ఆ రాష్ట్ర పోర్టల్ లో ప్రయాణికుల వివరాలను నమోదు చెేయాల్సి ఉంటుందని తెలిపారు పోలీసు అధికారులు.